మినీ లారీ బోల్తా; ఏడుగురు మృతి | mini lorry collapsed in ditch, seven killed | Sakshi
Sakshi News home page

మినీ లారీ బోల్తా; ఏడుగురు మృతి

Oct 23 2014 4:28 PM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

వేలూరు: తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. మినీలారీ  లోయలోకి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారీ లోయలోకి బోల్తా పడింది.

ప్రమాద సమయంలో లారీలో దాదాపు 40 మంది ఉన్నారు. వీరందరూ వేలూరు సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. గాయపడిన వారిని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement