న్యూయార్క్: ఈ ఏడాదికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 50 వ్యాపారవేత్తల్లో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. మాస్టర్కార్డ్ సీఈవో అజయ్ బంగా, వర్క్డే సహ-సీఈవో అనిల్ భూశ్రీ ఇందులో ఉన్నారు. బంగా 15వ స్థానాన్ని, భూశ్రీ 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. క్యాష్లెస్, మొబైల్ లావాదేవీలు పెరుగుతుండటం మాస్టర్కార్డ్ వ్యాపారం పెరగడానికి దోహదపడుతున్నాయని, ప్రస్తుతం 735 డాలర్లుగా ఉన్న షేరు ధర 1,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశం ఉందని ఫార్చూన్ పేర్కొంది. ఇక, భూశ్రీ సహ-సీఈవోగా వ్యవహరిస్తున్న వర్క్డే సంస్థ క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరులకు సంబంధించిన సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తోంది. 2013లో వర్క్డే అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు షేరు ధర .. పోటీ సంస్థ ఒరాకిల్ను మించి ఎగిసింది. అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కింది.
ఎలక్ట్రిక్ కార్లు తయారుచేసే టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ..ఫార్చూన్ 50 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిల్చారు. విప్లవాత్మకమైన చర్యలతో ఆటోమొబైల్, ఇంధన రంగాల్లో ఇతర సంస్థలకు మస్క్ సవాల్ విసురుతున్నారని ఫార్చూన్ పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ గురు, బెర్క్షైర్ హాథ్వే చైర్మన్ వారెన్ బఫెట్ రన్నరప్గా నిల్చారు. మరోవైపు, వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేయడం తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరో స్థానంలో ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 8వ స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాలకు సంబంధించి బెస్ట్ పురస్కారాలను కూడా ఫార్చూన్ ప్రకటించింది. దీని ప్రకారం బెస్ట్ న్యూ ఓనర్గా బెజోస్ నిలవగా, బెస్ట్ టర్న్ఎరౌండ్ సంస్థగా నెట్ఫ్లిక్స్ నిల్చింది. ఉత్తమ బిజినెస్ స్కూల్గా హార్వర్డ్, అత్యధిక పర్యాటకులు సందర్శించే బెస్ట్ సిటీగా బ్యాంకాక్ ఉన్నాయి.
ఫార్చూన్ 50 వ్యాపారవేత్తల్లో.. ఇద్దరు భారతీయులు
Published Fri, Nov 22 2013 12:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement