
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
కోల్ గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణకోర్టు జారీచేసిన సమన్లు రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు
కోల్ గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణకోర్టు జారీచేసిన సమన్లు రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన తరఫు లాయయర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకై ఏర్పాటయిన ప్రత్యేక కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన తుదిచార్జిషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8 లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.