వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ | Kiran Bedi returns security cover | Sakshi
Sakshi News home page

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

Feb 10 2015 9:56 PM | Updated on Sep 2 2017 9:06 PM

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆమె అంతకుముందు క్షమాపణ చెప్పారు.

బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు వై-ప్లస్ సెక్యురిటీ కల్పించారు. తనకిక వై-ప్లస్ సెక్యురిటీ అవసరం లేదని, రేపటి నుంచి భద్రతాధికారులు రావాల్సిన అవసరం లేదని సెక్యురిటీ సిబ్బందితో కిరణ్ బేడీ అన్నారు. తనకు భద్రత కల్పించిన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement