మంత్రిపై వేటు వేసిన జయలలిత | Jayalalithaa drops transport minister | Sakshi
Sakshi News home page

మంత్రిపై వేటు వేసిన జయలలిత

Jul 27 2015 2:55 PM | Updated on Sep 3 2017 6:16 AM

మంత్రిపై వేటు వేసిన జయలలిత

మంత్రిపై వేటు వేసిన జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి ఉద్వాసన పలికారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి ఉద్వాసన పలికారు. జయలలిత సూచన మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య.. సెంథిల్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. సోమవారం రాజ్భవన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

కరూర్ జిల్లా అన్నా డీఎంకే కార్యదర్శిగా ఉన్న సెంథిల్ను పార్టీ పదవి నుంచి కూడా జయలలిత తొలగించారు. ఇదిలావుండగా, తమిళనాడు పరిశ్రమల మంత్రి తంగమణికి రవాణ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement