ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి తెలిపారు. ఆమె గత 40 ఏళ్లుగా బృందావనంలోనే ఉంటున్నారు. బ్రిజ్ బాసి దేవి ఫిర్యాదుపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు మథుర సీనియర్ ఎస్పీ మంజిల్ సైనే తెలిపారు.