‘ముఖేశ్ కోర్టుకు హాజరు కానక్కర్లేదు’ | High Court exempts Mukesh Ambani from personal appearance in a criminal case | Sakshi
Sakshi News home page

‘ముఖేశ్ కోర్టుకు హాజరు కానక్కర్లేదు’

Aug 31 2013 3:28 AM | Updated on Sep 1 2017 10:17 PM

ఎనిమిదేళ్ల నాటి ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి స్వయంగా కోర్టుకు హాజరుకావడంపై ముఖేశ్ అంబానీకి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మినహాయింపునిచ్చింది.

న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల నాటి ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి స్వయంగా కోర్టుకు హాజరుకావడంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మినహాయింపునిచ్చింది. మొబైల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కేసులో కోర్టుకు కావాలని జూన్ 7న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముఖేశ్‌కు సమన్లు పంపారు. ముఖేశ్ అభ్యర్థన మేరకు ఆయనకు బదులు సెప్టెంబర్ 10న అధీకృత ప్రతినిధి ఎవరైనా కోర్టుకు హాజరుకావచ్చని హైకోర్టు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement