
ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి
పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం (పరవాడ) : పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సాయినాథ్ లైఫ్ సెన్సైస్లో రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో విశాఖపట్నం జిల్లా కసింకోటకు చెందిన శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమంత్ అనే ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.