దేశంలో మరో తుఫాన్ వీస్తోంది: నరేంద్ర మోడీ | Cyclone of change in country: Narendra Modi | Sakshi
Sakshi News home page

దేశంలో మరో తుఫాన్ వీస్తోంది: నరేంద్ర మోడీ

Oct 18 2013 5:30 PM | Updated on Aug 15 2018 2:14 PM

దేశంలో మరో తుఫాన్ వీస్తోంది: నరేంద్ర మోడీ - Sakshi

దేశంలో మరో తుఫాన్ వీస్తోంది: నరేంద్ర మోడీ

ప్రస్తుతం దేశంలో మార్పు అనే తుఫాన్ బలంగా వీస్తోంది అని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి అన్నారు. ఫైలీన్ తుఫాన్ మించి ఉంటుందని చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలో మార్పు అనే తుఫాన్ బలంగా వీస్తోంది అని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి అన్నారు. ఫైలీన్ తుఫాన్ మించి ఉంటుందని చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. 
 
దేశంలో మార్పు అనే తుఫాన్ ఉంది అని.. ఎంతో నష్టాన్ని కలిగించిన ఫైలీన్ తుఫాన్ ను ఆపివేస్తుంది అని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లోని  ఉన్నావ్ లో బంగారం కోసం తవ్వకాలు చేపట్టకుండా.. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాలి అని విమర్శించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో మార్పు చోటుచేసుకోవాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని.. బీజేపీ అధికారంలోకి రావడంతో తమిళ ప్రజల కలలు నిజమవుతాయని ఆయన అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement