గాంధీ మునిమనవరాలిపై చీటింగ్ కేసు | Cheating case against Gandhi great-granddaughter | Sakshi
Sakshi News home page

గాంధీ మునిమనవరాలిపై చీటింగ్ కేసు

Oct 21 2015 4:51 AM | Updated on Sep 3 2017 11:15 AM

గాంధీ మునిమనవరాలిపై చీటింగ్ కేసు

గాంధీ మునిమనవరాలిపై చీటింగ్ కేసు

ఇద్దరు వ్యాపారవేత్తలను మోసం చేశారన్న అభియోగంపై మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్(45) సోమవారం డర్బన్ కోర్టుకు హాజరయ్యారు

జోహెన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా): ఇద్దరు వ్యాపారవేత్తలను మోసం చేశారన్న అభియోగంపై మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్(45) సోమవారం డర్బన్ కోర్టుకు హాజరయ్యారు. దక్షిణాఫ్రికాలో 8,30,887 డాలర్లకు ఇద్దరు వ్యాపారవేత్తలను మోసం చేశారని కొద్ది రోజుల క్రితం ఆమెపై కేసు నమోదైంది. ఆమె డర్బన్ కోర్టులో వాదిస్తూ తాను రెండు ఆసుపత్రులకు పరుపులను అందజేయడం కోసం టెండర్ దక్కించుకున్నానని... కంటైనర్‌లను పంపని కారణంగా పరుపులను సరఫరా చేయలేకపోయానని పేర్కొంది. ఈ వాదనంతా బోగస్ అని వ్యాపారులు కోర్టుకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement