తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా | Charu sinha appointed as ACB director general | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా

Dec 31 2016 7:00 PM | Updated on Sep 5 2017 12:03 AM

తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా

తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా

ఏకే ఖాన్ పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఏసీబీ నూతన అధిపతిగా చారు సిన్హా నియమితులయ్యారు.

హైదరాబాద్: అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) నూతన అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చారు సిన్హాను నియమిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ పదవిలో కొనసాగుతున్న ఏకే ఖాన్‌ (డిసెంబర్‌ 31న) రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారు సిన్హా ప్రస్తుతం అదే విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
పదవీ విరమణ చేయనున్న ఏకే ఖాన్(1981 ఐపీఎస్‌ బ్యాచ్‌)‌.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోట్లు సహా పలు కీలకమన కేసులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఈ-ఆఫీసు, లీగల్‌ సెల్‌, సైబర్‌సెల్‌ ఏర్పాటుచేసి దేశంలోనే తొలి సాంకేతిక హంగులు గల ఏసీబీ ఆఫీసుగా తెలంగాణ ఏసీబీ ఆఫీసును తీర్చిదిద్దడంలో ఖాన్‌ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement