సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి వంశీ మోహన్కు సంబంధించి 8 ఇళ్లలో తనిఖీలు చేపట్టింది.
కాగా, వంశీ మోహన్ శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవో పనిచేసిన సమయంలో వంశీ మోహన్ పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయనికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసినట్లు తన మామ పేరుపై రిజిస్టేషన్ చేయించి రియల్టర్కు దారాదత్తం చేశాడు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వంశీ మోహన్పై వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేసిన ఆరోపణలపై అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.



