బెంగాల్, మణిపూర్‌లో బాంబు పేలుళ్లు | Bomb Blasts in West Bengal, Manipur: Ten injured | Sakshi
Sakshi News home page

బెంగాల్, మణిపూర్‌లో బాంబు పేలుళ్లు

Aug 18 2013 11:38 PM | Updated on Sep 1 2017 9:54 PM

పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో సంభవించిన బాంబు పేలుళ్లు స్థానికంగా కలకలం సృష్టించాయి.

ఇంఫాల్/జల్‌పాయ్‌గురి: పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో సంభవించిన బాంబు పేలుళ్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఆయా పేలుళ్లలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ హోటల్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో శక్తివంతమైన బాంబును విసిరారు.

ఈ పేలుడు ధాటికి  హోటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసేందుకే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

అదేవిధంగా, పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఉన్న బరోదిశా పట్టణంలో ఆదివారం ఓ బస్సులో బాంబు పేలింది. అప్పటికే ఓ హోటల్ ముందు ఆగి ఉండడంతో బస్సులో ప్రయాణికులు అందరూ కిందకి దిగిపోయారని, అయితే, అందులోనే ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు తామే బాధ్యులమని నేషనల్ లిబరేషన్ ఫోర్స్ ఆఫ్ బెంగాలీస్(ఎన్‌ఎల్‌ఎఫ్‌బీ) ప్రకటించుకున్నట్టు చెప్పారు. బెంగాలీలపై అస్సాంలో జరగుతున్న వేధింపులకు నిరసనగానే బాంబును అమర్చినట్టు ఎన్‌ఎల్‌ఎఫ్‌బీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement