పటిష్టంగా బ్యాంకింగ్ | Banking Sector to be strengthened | Sakshi
Sakshi News home page

పటిష్టంగా బ్యాంకింగ్

Aug 28 2013 2:24 AM | Updated on Sep 1 2017 10:10 PM

పటిష్టంగా బ్యాంకింగ్

పటిష్టంగా బ్యాంకింగ్

బ్యాంకింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాం క్(ఆర్‌బీఐ) వ్యూహ రచన చేస్తోంది. కొత్త బ్యాంకులకు కఠిన ‘ఎంట్రీ’ నిబంధనలతోపాటు,

ముంబై: బ్యాంకింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాం క్(ఆర్‌బీఐ) వ్యూహ రచన చేస్తోంది. కొత్త బ్యాంకులకు కఠిన ‘ఎంట్రీ’ నిబంధనలతోపాటు, దేశీయ బ్యాంకింగ్  నాలుగు అంచెల పటిష్ట వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు ఉండాలని భావిస్తోంది. ‘భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ-పురోగతికి మార్గం’ అన్న శీర్షికన తాజాగా ఒక చర్చా పత్రాన్ని ఆవిష్కరించింది. 
 
 నాలుగు అంచెలు ఇలా...: నాలుగు అంచెల వ్యవస్థలో మొదటి వరుసలో విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా దేశీయ-దేశీయేతర దిగ్గజ బ్యాంకులు 3-4 ఉంటాయి. రెండవ అంచెలో మిడ్-సైజ్ బ్యాంకులు ఉంటాయి. మూడవ కేటగిరిలో ఓల్డ్ సెక్టార్ ప్రైవేటు బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మల్టీ స్టేట్ సహకార బ్యాంకులు పనిచేస్తాయి. చివరి శ్రేణిలో ప్రైవేటు లోకల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement