అసోంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్‌ | Andhra engineer kidnapped in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్‌

Dec 23 2013 9:33 AM | Updated on Aug 18 2018 4:27 PM

రాష్ట్రంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్ కు గురియ్యాడు. బీఎస్ సీ కంపెనీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అంకన్ రావు అనే ఇంజినీర్ ను బోడో తీవ్రావాదులు కిడ్నాప్ చేశారు.

అస్సాం: రాష్ట్రంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్ కు గురైయ్యాడు. బీఎస్ సీ కంపెనీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అంకన్‌రావు అనే ఇంజినీర్ ను బోడో తీవ్రావాదులు కిడ్నాప్ చేశారు. ఆ ఇంజినీర్ తోపాటు మరో ముగ్గురిని కూడా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఖైరాబరీలో నిన్న సాయంత్రం 4గంటల ప్రాంతంలోతమ విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా వారిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది.

ఆ తరువాత ఆ ముగ్గురిని వదిలిపెట్టారు. అంకన్‌రావును మాత్రం వారివద్దే బందీగా ఉంచినట్టు సమాచారం. కిడ్నాప్ కు గురైన అంకన్‌రావుది స్వస్థలం ప్రకాశం జిల్లా. ఇంజినీర్ ను విడుదలచేయాల్సిందిగా చాలా సంస్థలు కలిసి తీవ్రవాదులకు విజ్ఞప్తిచేశాయి. ఇంజినీర్ ను తీవ్రవాదుల చెరనుంచి రక్షించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, కొన్ని నెలల కిత్రం పైడిరాజు అనే ఇంజినీరింగ్‌ను కూడా బోడో తీవ్రావాదులు కిడ్నాప్ చేసి అనంతరం వదిలిపెట్టినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement