టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మైదానంలో తాను తరచూగా ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటానని చెప్పాడు. అతను ఎవరో కాదు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లియే. ధోని కేవలం వన్డేలు, టీ-20లకు మాత్రమే నాయకత్వం వహిస్తుండగా.. టెస్టు జట్టుకు కోహ్లి సారథిగా ఉన్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో మూడు ఫార్మెట్లకు ఒకే కెప్టెన్ను నియమించే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మైదానంలో తాను తరచూ కోహ్లి నుంచి సలహాలు తీసుకుంటానని ధోనీ చెప్పడం గమనార్హం.
న్యూజిల్యాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లి నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి.. సిరీస్ను వైట్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టుతో జరిగే వన్డే సిరీస్లోనూ కోహ్లి సలహాలు అవసరమవుతాయని ధోనీ చెప్పుకొచ్చాడు. 'అతన్ని (కోహ్లి) ఎక్కువగా వాడుకోవడం నేను ఇప్పటికే ప్రారంభించాను. మీరు మ్యాచ్లను నిశితంగా గమనించినట్టయితే.. మైదానంలో నేను అతనితో ఎక్కువ సంప్రదింపులు జరుపుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న భిన్నమైన ఆలోచనలు పంచుకోవడానికి అది అవసరం' అని ధోనీ శనివారం విలేకరులతో చెప్పాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిల్యాండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. న్యూజిల్యాండ్పై టెస్టు సిరీస్ గెలుపు నేపథ్యంలో కోహ్లిని మూడు ఫార్మెట్లకు కెప్టెన్గా నియమించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెప్టెన్గా తన బాధ్యతలేమీ కొత్తగా మారకపోయినా.. భవిష్యత్ తరం క్రికెటర్లకు మెంటర్గా ఉండాల్సిన బాధ్యత అదనంగా వచ్చి చేరిందని ధోనీ పేర్కొన్నాడు.
టెస్టు సారథి కోహ్లిపై ధోనీ రేర్ కామెంట్స్!
Published Sat, Oct 15 2016 6:46 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పనులు వేగంగా చేయిస్తున్నాం: కలెక్టర్
ఆత్మ ఘోష..!
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
రామన్పాడులో 1,010 అడుగులు
వెళ్దామంటే దారులు లేవు
ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
Advertisement