ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయింది.
జువా ఫ్రావిన్స్ ముఖ్యపట్టణం సుఖబూమికి నైరుతి దిశగా 179 కిలోమీటర్ల దూరంలో, సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేసియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జువాతోపాటు రాజధాని జకార్తాలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కలగలేదని, సునామి ప్రమాదంకూడా లేదని అధికారులు చెప్పారు.