ఆహారం వికటించి 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత | 10 students to upset with food poison | Sakshi
Sakshi News home page

ఆహారం వికటించి 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Aug 8 2015 11:24 PM | Updated on Sep 3 2017 7:03 AM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వసతి గృహంలో ఆహారం వికటించి 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వసతి గృహంలో ఆహారం వికటించి 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శనివారం ఉదయం విద్యార్థులకు పులగం, చట్నీ వడ్డించారు. అనంతరం విద్యార్థులకు వాంతులు, కడుపులో నొప్పి, జ్వరంతో అస్వస్థత పాలయ్యారు. అందులో ఒక విద్యార్థికి రాత్రయ్యే సరికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావడంతో కర్నూలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement