యువతులను తరలిస్తున్న దంపతులఅరెస్ట్
నిందితులపై కేసు
యువతులను జడ్జి ఎదుట
హాజరుపరిచి ఇళ్లకు పంపించిన పోలీసులు
సూర్యాపేట : ‘‘ఓ పెద్ద మనిషి కుటుంబంలో వివాహవేడుక ఉంది... అక్కడ మీరు నృత్యం చేసి ఆహ్వానితులను సంతృప్తిపరిస్తే మంచి పారితోషికం లభిస్తుంది’’ అంటూ పేద యువతులను ప్రలోభపెట్టి వ్యభిచారరొంపిలోకి దింపుతున్న దంపతుల గుట్టురట్టయ్యింది.. రాష్ట్ర రాజధాని సమీప జిల్లాలకు చెందిన ఆరుగురు యువతులను ఇదే తరహాలో విశాఖ పట్టణానికి తరలిస్తూ వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని యూసుఫ్గూడకు చెందిన బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతులు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండలకు చెందిన ఆరుగురు యువతులను విశాఖపట్నంలో ఓ వివాహ వేడుకలో నృత్యం చేయాలని నమ్మబలికి తీసుకెళ్తున్నారు. ఏపీ9బిహెచ్2124 నంబర్ గల ఫోర్డ్ ఎన్డీవర్ వాహనంలో ఆ ఆరుగురుని ఎక్కించుకొని శుక్రవారం రాత్రి విశాఖపట్నానికి బయలుదేరారు.
సూర్యాపేట పట్టణ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ - విజయవాడ రహదారిపై గల ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఎన్డీవర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అం దులో ఉన్న దంపతులు, యువతులను ప్రశ్నించగా తాము ఓ వివాహ వేడుకకు విశాఖపట్నానికి వెళ్తున్నామని, ఇందులో ఉన్న వారంతా నృత్యం చేసేవారని తెలిపారు. వాహనంలో ఉన్నవారు భయాందోళనకు గురయినట్టు గమనించిన పోలీసులు గట్టిగా దబాయించారు. దంపతులిద్దరూ కొంత కాలంగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఆరుగురు యువతులను కూడా వ్యభి చార కూపానికి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని సీఐ మొగలయ్య తెలిపారు. దంపతులిద్దరి పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆరుగురు యువతులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి వారి వారి ఇళ్లకు పంపించినట్టు పేర్కొన్నారు.
వారు దంపతులేనా..?
బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతుల కాదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు కొంత కాలంగా పెళ్లిళ్ల వద్ద నృత్యం చేయాలని నమ్మబలుకుతూ యువతులను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు సమాచారం. ఆర్థిక అవసరాల కోసం విద్యార్థినులు, గిరిజన తండాలకు చెందిన యువతులు వీరి వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలోకి దిగుతున్నట్టు తెలిసింది.
మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి..
Published Sun, Feb 22 2015 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement