యువ రైతు బలవన్మరణం | young Farmer commit suicide | Sakshi
Sakshi News home page

యువ రైతు బలవన్మరణం

Nov 12 2015 4:41 PM | Updated on Sep 3 2017 12:23 PM

అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూనెం పుల్లయ్య(27) రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 8 ఎకరాల్లో పత్తి  పంట వేశాడు.  అయితే, పూత కాయ సరిగా లేకపోవటంతో దిగుబడి ఆశించినంత రాలేదు. సాగు కోసం చేసిన రూ.2.50 లక్షలను తీర్చేదారి తెలియక తీవ్ర ఆందోళన చెందిన పుల్లయ్య గురువారం ఉదయం చేనులోనే పురుగు మందు తాగాడు. కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుంగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అతనికి భార్య ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement