యాదవుల వినూత్న నిరసన

యాదవుల వినూత్న నిరసన - Sakshi


చంద్రబాబు  క్షమాపణ చెప్పాలని జీవాలతో జాతీయ రహదారి దిగ్బంధం

తూప్రాన్: గొర్రె కాపరుల పట్ల టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం యాదవులు వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు కాసేవాడేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే. బాబు వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గొర్రెలు, మేకలతో తరలివచ్చిన యాదవులు రహదారిపై బైఠాయించారు. చంద్రబాబు గొర్రె కాపరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గండి మల్లేశ్‌యాదవ్ డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top