వంట రాదంటూ భర్త తిట్టాడని.. | woman commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

వంట రాదంటూ భర్త తిట్టాడని..

Nov 27 2017 7:53 PM | Updated on Nov 6 2018 8:08 PM

woman commits suicide in hyderabad - Sakshi

సాక్షి, నాగోలు: వంట చేయటం లేదంటూ భర్త తిట్టాడనే కోపంతో ఓ మహిళ ఆత్మహత‍్మకు పాల్పడింది. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సూదిని శ్రీలత (23)కు అదే ప్రాంతానికి చెందిన అనంతరెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం అయింది. ఈ దంపతులు బైరామల్‌గూడ సాయినగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. 

శ్రీలతకు వంట చేయటం రాదని పెళ్లికి ముందే కుటుంబసభ్యులు చెప్పారు. అయినా, తాము నేర్పించుకుంటామంటూ అనంతరెడ్డి నగరానికి తీసుకువచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి భర్త అనంతరెడ్డి వంట చేయటం లేదంటూ భార్యను వేధిస్తున్నాడు. ఈ నెల 16న భర్త ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. శ్రీలత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement