
హైదరాబాద్ : భర్త వదిలేశాడని, తనను ఆదుకోవాలని కోరుతూ ఓ గృహిణి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక వదిలేశాడని సుష్మ అనే మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు.