తాగిన మైకంలో భార్యను చంపిన భర్త | wife murdered by husband in warangal district | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో భార్యను చంపిన భర్త

May 29 2017 11:10 AM | Updated on Jul 10 2019 8:00 PM

తాగిన మైకంలో భార్యను కర్రతో మోది హత్య చేసిన భర్త ఉదంతమిది.

నర్సంపేట రూరల్‌: తాగిన మైకంలో భార్యను కర్రతో మోది హత్య చేసిన భర్త ఉదంతమిది. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం ధర్మరావుపేటలో జరిగింది. రాజేందర్‌, మంగమ్మ(35)లు భార్యాభర్తలు. వీరికి బాబు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలకు తాగుడు అలవాటు ఉందని, రోజూ ఇద్దరూ తాగి గొడవ పడుతుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో దుర్గమ్మ పూజ ఉండడంతో ఎవరూ తాగవద్దని తోటి కులస్తులు చెప్పడంతో మంగమ్మ తాగలేదు. అయితే రాజేందర్‌ తాగి వచ్చి అర్ధరాత్రివేళ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్రతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కర్రతో తల్లిని కొట్టి చంపాడని బాలిక చుట్టుపక్కలవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement