జంతర్‌మంతర్‌ వద్ద నేతన్నల ధర్నా | Vivek Venkata Swami Support Waiver Protest At Delhi Jantermanter | Sakshi
Sakshi News home page

మద్దతు తెలిపిన వివేక్‌ వెంకటస్వామి

Jun 25 2019 2:17 PM | Updated on Jun 25 2019 2:30 PM

Vivek Venkata Swami Support Waiver Protest At Delhi Jantermanter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ వెంకటస్వామి, సీపీఐ రాజ్యసభ ఎంపీ రాగేష్‌ నేతన్నల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇప్పటి వరకూ దాదాపు 350 మంది చేనేత కార్మికులు చనిపోయారని తెలిపారు. మరణించిన నేత కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement