బ్రాహ్మణులకు అండగా ఉంటాం..
ఫ దాడుల నిరోధానికి ప్రత్యేక చర్యలు
ఫ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు
కాకినాడ: బ్రాహ్మణ సామాజికవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడచిన ఐదేళ్లలో ఎన్నో చర్యలు తీసుకున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్థానిక డీ కన్వెన్షన్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కందాళ దుర్గ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సదస్సుకు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. రాయవరపు ప్రభాకర్, భమిడిపల్లి మూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సభలో మల్లాది విష్ణు మాట్లాడుతూ దేవాలయాలు, పురోహితులు, అర్చకులపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూజారుల జీతభత్యాలను రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారని చెప్పారు. బ్రాహ్మణ వర్గీయులంతా వైఎస్సార్ సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు మద్దతుగా నిలవాలని కోరారు. చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ విజ్ఞాన వంతులైన బ్రాహ్మణులు వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని కోరారు. ద్వారంపూడి మాట్లాడుతూ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బ్రాహ్మణ వర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకున్నారన్నారు. రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. బ్రాహ్మణ కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు, సంఘ ప్రతినిధులు రాయప్రోలు కృష్ణమూర్తి, పోతాప్రగడ రవికుమార్, అజ్జరపు సత్యనారాయణ, శర్మ, పిండిప్రోలు రాజు పాల్గొన్నారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీటకాకినాడ రూరల్: బ్రాహ్మణ సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రమణయ్యపేట వైద్యనగర్లో వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుకు మద్దతుగా ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రాహ్మణ సొసైటీ ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత, గ్రూపు రుణాలు మంజూరయ్యాయన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించి, పదవీ విరమణ తొలగించారని, తద్వారా ఓపిక ఉన్నంత వరకూ అర్చకత్వం చేసుకునే వెసులుబాటు లభించిందన్నారు. బ్రాహ్మణులకు సొసైటీ పేరిట బ్రాహ్మణ బ్యాంకు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఐదేళ్లలో రూ.784 కోట్లు బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు చేశారని, టీడీపీ హయాంలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మృతి చెందిన కుటుంబాలకు గరుడ పథకంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయం పెండింగ్ లేకుండా అందజేశారన్నారు. వైఎస్సార్ సీపీని మరోసారి గెలిపించేందుకు బ్రాహ్మణులు ఏకతాటిపైకి రావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కురుసాల సత్యనారాయణ, బ్రాహ్మణ సంఘాల నాయకులు కందాల కనకదుర్గ, రవికుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు.