రాజీమార్గమే ఉత్తమం | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే ఉత్తమం

Published Sat, Sep 12 2015 6:17 PM

village settlement is good idea says  Munsiff Court judge

కరీంనగర్: కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు ఇరువురు రాజీమార్గం అవలంబించడమే ఉత్తమమని మున్సిఫ్‌ కోర్టు జడ్జీ మాధవి అన్నారు. మండల కేంద్రంలోని మున్సిఫ్‌కోర్టులో శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమస్యలను పెద్దదిగా చేయకుండా పెద్దమనుషులు శాంతియుతంగా పరిష్కరించుకుంటే గొడవలు రావన్నారు. ఆవేశాలకు, పగలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుందన్నారు. ఇరువురు కక్షిదారులు రాజీపడడంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Advertisement
Advertisement