రాజన్న ఆదాయం రూ.81 లక్షలు | Sakshi
Sakshi News home page

రాజన్న ఆదాయం రూ.81 లక్షలు

Published Fri, Apr 14 2017 7:26 PM

vemulawada temple get Rs 81 lacks income

వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.81 లక్షల పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 13 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయంలో లెక్కించారు. రూ.81 లక్షల 17 వేల 520 నగదు, 162 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కిలోల వెండి ఆభరణాలు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా, ఎస్పీఎఫ్‌, సివిల్‌ పోలీసుల పహారా మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు.

Advertisement
Advertisement