
మాట్లాడుతున్న వనమా వెంకటేశ్వరరావు
సాక్షి, కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం నియోజకవర్గంలో తనకు ప్రజల ఆదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తానని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తనకు ప్రజలందరూ ఓటు రూపంలో సహకరిస్తున్నారన్నారు. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారయణ, (చిన్ని), లాయర్ లక్కినేని సత్యనారయణ తదితరులు ఉన్నారు.