టీ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి? | V narasimha rao slams Seemandhra leaders | Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి?

Mar 6 2015 5:08 PM | Updated on Aug 11 2018 7:11 PM

టీ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి? - Sakshi

టీ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో  సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి  విక్రమార్కల నియామకంలో  సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకున్నారని వీహెచ్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, పార్టీ అంతర్గత విషయాలను బాహాటంగా బయటపెట్టడంపై వీహెచ్ను ఎమ్మెల్సీ రంగారెడ్డి తప్పుబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement