పోలీసుల సమక్షంలోనే నేరస్థుడ్ని కొట్టి చంపారు! | unknown persons attack on old criminal died | Sakshi
Sakshi News home page

పోలీసుల సమక్షంలోనే నేరస్థుడ్ని కొట్టి చంపారు!

Apr 2 2015 10:22 PM | Updated on Mar 28 2018 11:08 AM

పోలీసుల సమక్షంలోనే పాత నేరస్థుడ్ని కొట్టి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీది పల్లిలో గురువారం రాత్రి కలకలం సృష్టించింది.

బండమీది పల్లి: పోలీసుల సమక్షంలోనే పాత నేరస్థుడ్ని కొట్టి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీది పల్లిలో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో భాగంగా బుగ్గప్ప అనే నేరస్థుడ్నిపోలీసులు తమ వెంట అతని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం  స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు కాపుకాసి బుగ్గప్పపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బుగ్గప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.

 

ఈ ఘటన పోలీసుల సమక్షంలో జరిగినా వారు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుగ్గప్ప మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement