మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం నగరంతండాలో శనివారం రాత్రి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
రామాయంపేట: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం నగరంతండాలో శనివారం రాత్రి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
గత రెండు రోజులుగా మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పాత గోడ కూలింది. ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న గీత(7), చిట్టి(10) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.