ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | TSRTC Strike: Woman killed after RTC bus hits In Nizamabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Oct 16 2019 8:03 PM | Updated on Oct 16 2019 8:37 PM

TSRTC Strike: Woman killed after RTC bus hits In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం(45) ఇంటినుంచి మార్కెట్‌ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు నందిపేటనుంచి నిజామాబాద్‌ వైపు వస్తోంది. ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద వెనుకనుంచి అబీబా బేగంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్‌ కర్షక్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా అనుభవం లేని డ్రైవర్‌ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement