కేసీఆర్, వెంకయ్య దుర్బుద్ధి వల్లే.. | TS, Centre playing games on SC classification issue: Sampath | Sakshi
Sakshi News home page

కేసీఆర్, వెంకయ్య దుర్బుద్ధి వల్లే..

Feb 8 2017 3:19 AM | Updated on Aug 21 2018 9:33 PM

కేసీఆర్, వెంకయ్య దుర్బుద్ధి వల్లే.. - Sakshi

కేసీఆర్, వెంకయ్య దుర్బుద్ధి వల్లే..

సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల దుర్బుద్ధివల్లనే ప్రధాన మంత్రి మోదీతో అఖిలపక్ష సమావేశం వాయిదా పడిందని ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌కుమార్‌ ఆరోపించారు.

అఖిలపక్షం వాయిదా పడిందన్న సంపత్‌
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల దుర్బుద్ధివల్లనే ప్రధాన మంత్రి మోదీతో అఖిలపక్ష సమావేశం వాయిదా పడిందని ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌కుమార్‌ ఆరోపించారు. దళితుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు, తీసుకున్న చర్యలు, జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంతోకాలంగా కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement