చెప్పినట్టు వింటే సరే లేకుంటే.... | TRS Leaders smoothly warning to MPTC Candidates in karimnagar district | Sakshi
Sakshi News home page

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

Mar 22 2014 9:22 AM | Updated on Sep 2 2017 5:01 AM

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

‘ఈ ఎన్నికల్లో మిమ్మల్ని అభ్యర్థినిగా నిలబెట్టి గెలిపిస్తాం. గెలిచిన తర్వాత మాకే మద్దతివ్వాలి. లేకుంటే రూ.పది లక్షల చెల్లించాలి.’

‘ఈ ఎన్నికల్లో మిమ్మల్ని అభ్యర్థినిగా నిలబెట్టి గెలిపిస్తాం. గెలిచిన తర్వాత మాకే మద్దతివ్వాలి. లేకుంటే రూ.పది లక్షల చెల్లించాలి.’ ఇలా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓ మహిళా అభ్యర్థితో పత్రం రాయించుకోవడం కోనరావుపేట మండలంలో చర్చనీయూంశమైంది. మండలంలోని ఓ గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ రాలేదు. మండల ముఖ్య నాయకులు గ్రామంలోని ఓ మహిళను గుర్తించి ఆమెతో సంప్రదింపులు జరిపారు.

 

 టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని హామీఇచ్చారు. తీరా గెలిచాక తమకు మద్దతు ఇవ్వకపోతే ఎలా? అన్న అనుమానం వారికి వ చ్చింది. దీంతో సదరు మహిళా అభ్యర్థితో బాండ్ పేపర్‌మీద రూ.పది లక్షల అప్పు ఉన్నట్లు రాయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవకపోతే ఏమీ లేదు. ఒకవేళ గెలిస్తే తమకు మద్దతు తెలపాలి. మద్దతు ఇవ్వకపోతే  రూ.పది లక్షలు చెల్లించాలి.

 

 ఇదీ బాండ్ పేపర్‌లోని సారాంశం. ఈ విషయం అనూహ్యంగా బయటకు పొక్కి మండలంలో చర్చనీయాంశమైంది. సదరు అభ్యర్థిని టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడి విషయాన్ని బయటకు తెలియనివ్వకుడా చూస్తున్నారు. అయినా కూడా ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు జుట్టు పీక్కుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement