టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి హల్‌చల్‌ | TRS leader son over action | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి హల్‌చల్‌

Aug 2 2017 2:39 AM | Updated on Sep 17 2017 5:03 PM

దాడికి పాల్పడిన యువకులు, గాయపడిన టోల్‌ప్లాజా సూపర్‌వైజర్‌ మహేశ్‌గౌడ్‌

దాడికి పాల్పడిన యువకులు, గాయపడిన టోల్‌ప్లాజా సూపర్‌వైజర్‌ మహేశ్‌గౌడ్‌

శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌–మైసిగండి మధ్య ఉన్న టోల్‌ప్లాజా వద్ద అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు తన మిత్ర బృందంతో కలసి హల్‌చల్‌ చేశాడు.

టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిపై కత్తితో దాడిచేసిన అతడి మిత్రబృందం
 
కడ్తాల్‌ (కల్వకుర్తి): శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌–మైసిగండి మధ్య ఉన్న టోల్‌ప్లాజా వద్ద అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు తన మిత్ర బృందంతో కలసి హల్‌చల్‌ చేశాడు. నిర్ణీత మార్గంలో వెళ్లాలని సూచించిన టోల్‌ప్లాజా సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన ఆరుగురు యువకులు అరుణ్‌రెడ్డి, నిషిత్, సాయితేజ్‌ రెడ్డి, మనీష్‌గౌడ్, సాయికుమార్, అనిరుధ్‌లు సోమవారం కడ్తాల్‌ మండల పరిధిలోని మైసిగండిలో సాయితేజ్‌రెడ్డి జన్మ దిన వేడుకలు జరిపారు.

వేడుకలకు సాయి తేజ్‌రెడ్డితో పాటు, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్‌  కొడుకు మనీష్‌గౌడ్, ఐదుగురు మిత్రులతో కలసి జిప్సీ వాహనంలో మైసిగండి వచ్చారు. బర్త్‌డే వేడుకల అనంతరం రాత్రి తిరుగు పయనమ య్యారు. మార్గమధ్యలో కడ్తాల్‌ టోల్‌ప్లాజా వద్ద నిర్ణీత మార్గంలో కాకుండా పక్కన ఉన్న బారికేడ్‌లను తొలగించి ముందుకు సాగారు. దీంతో టోల్‌ప్లాజాలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కడ్తాల్‌కి చెందిన మాదారం మహేశ్‌ గౌడ్‌ సరైన దారిలో రావాలని కోరాడు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్‌గౌడ్‌పై దాడి చేశారు. వాహనంలో ఉన్న అరుణ్‌రెడ్డి కిందకు దిగి అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో మహేశ్‌గౌడ్‌పై దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో అతనికి రెండు చేతులకు గాయాలయ్యాయి.

గమనించిన టోల్‌గేట్‌ సిబ్బంది ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు వాహనంలో పారిపోయారు. వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది కడ్తాల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌కు సమాచారం అందిచారు. దీంతో శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టి పారిపోతున్న యువకులను పట్టుకున్నారు. బాధితుడు మహేశ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు వారిపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
నా కుమారుడి ప్రమేయం లేదు
హైదరాబాద్‌: కడ్తాల్‌ టోల్‌ప్లాజా దాడి కేసులో తన కుమారుడు మనీష్‌గౌడ్‌కు ఎలాంటి సంబం«ధంలేదని ఎల్‌బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మో హన్‌గౌడ్‌ అన్నారు. మనీష్‌గౌడ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడని టోల్‌గేటు వద్ద జరిగిన దాడిలో అతని స్నేహితులు సాయి, నితీష్, అరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారని చెప్పారు.  కారులో ఉన్నందునే తన కుమారుడిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 
Advertisement
 
Advertisement
Advertisement