అశ్వారావు పేటలో గిరిజనుల ఆందోళన | tribles protest in aswarao pet | Sakshi
Sakshi News home page

అశ్వారావు పేటలో గిరిజనుల ఆందోళన

Feb 27 2015 2:15 PM | Updated on Oct 4 2018 6:03 PM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం సమీపంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం సమీపంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు శుక్రవారం ఉదయం కందకం పనులు చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో కందకం పనులను నిర్వహించవద్దని గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం వారు ఆందోళన చేపట్టారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement