మిషన్ కాకతీయ పనులు ప్రారంభం | the Mission Kakatiya beginning of work | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

May 26 2016 2:54 AM | Updated on Sep 2 2018 4:16 PM

మిషన్ కాకతీయ పనులు ప్రారంభం - Sakshi

మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

తాళ్లపల్లి గ్రామ చెరువులో సింగరేణి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ పనులను బుధవారం ఓసీపీ పీవో కవీంద్రుడు....

శ్రీరాంపూర్ : తాళ్లపల్లి గ్రామ చెరువులో సింగరేణి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ పనులను బుధవారం ఓసీపీ పీవో కవీంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐత శంకర్ మాట్లాడుతూ సింగరేణి కూడా మిషన్ కాకతీయ పనుల్లో భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో  సింగపూర్ సర్పంచ్ రాజేంద్రపాణి, గ్రామ కార్యదర్శి సప్ధర్ అలీ, ఎంపీటీసీ సభ్యుడు బండారి సుధాకర్, వార్డు సభ్యులు తిరుమల్  పాల్గొన్నారు.

క్లీన్ అండ్ గ్రీన్..
ఇదిలా ఉంటే అనంతరం వాటర్ ట్యాంక్ ఏరియాలోక్లీన్ అండ్ గ్రీన్  చేపట్టారు. వచ్చేది వర్షాకాలం అయినందుకు పారిశుధ్య సమస్య ఉత్పన్నం కాకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ప్రవీణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement