వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న పరకాల బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది.
పరకాలలో ఉద్రిక్తత
Jul 22 2017 11:45 AM | Updated on Sep 5 2017 4:38 PM
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపడుతున్న పరకాల బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. పరకాలను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ర్యాలీ సాగుతుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరస్థితి నెలకొంది.
Advertisement
Advertisement