ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతల డుమ్మా | telangana congress leader not attend to kcr oath | Sakshi
Sakshi News home page

ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతల డుమ్మా

Jun 2 2014 11:37 AM | Updated on Aug 15 2018 8:57 PM

కేసీఆర్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీనియర్ నాయకులు హాజరుకాలేదు.

హైదరాబాద్: కేసీఆర్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీనియర్ నాయకులు హాజరుకాలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి రాలేదు. టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వక విలువలు పాటించలేదని కాంగ్రెస్ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు.

అందరి మాదిరిగానే కాంగ్రెస్ నాయకులకు ఆహ్వాన పత్రాలు అందాయి. అయితే ఫోన్‌చేసి పిలవడం సంప్రదాయమని సీనియర్ నేతలు అంటున్నారు. ఈ సంప్రదాయాన్ని పాటించనందువల్లే తాము కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement