మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్ | Telangana CM KCR pays tribute to Prof Jayashankar .. | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్

Jun 22 2015 3:56 AM | Updated on Aug 15 2018 9:27 PM

మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్ - Sakshi

మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్

తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొ కె.జయశంకర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ భవన్‌లో జయశంకర్‌కు సీఎం నివాళులు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విడమరిచి చెప్పిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మి, తెలంగాణ వాదులను ఏకం చేశారని సీఎం కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం వచ్చిన తరువాత జరుగుతున్న అభివృద్ధి తప్పక జయశంకర్ సార్  ఆత్మకు శాంతిని చేకూరుస్తుందన్నారు.  జయశంకర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, వినోద్ , మంత్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement