
బలహీనవర్గాల ఇళ్లకు రూ. 3.5 లక్షలు
బలహీనవర్గాల గృహనిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
బలహీనవర్గాల గృహనిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వీళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించడానికి ఒక్కొక్కరికి 3.5 లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతామని, ఆయా ప్రాంతాల్లో ఉండేవారికి కూడా ఈ పథకం కింద గృహనిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.