రాష్ట్రానికి ప్రారంభమైన వలస కూలీల తిరిగి రాక

Telangana: 225 Migrant Workers Came Back To State From Bihar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న​ వలస కూలీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. తొలి విడతగా బిహార్‌ నుంచి 225 మంది వలస కూలీలు హైదరాబద్‌కు చేరుకున్నారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్‌ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. 225 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక బస్సుల్లో తెలంగాణలోని జిల్లాలకు తరలించనున్నారు. (తొలి రోజే లిక్కర్‌ అమ్మకాలు రికార్డ్‌ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top