ఆలిండియా పోలీస్ బాక్సింగ్‌లో రాష్ట్రానికి రెండు పథకాలు | telanga police man got two medals in all india boxing | Sakshi
Sakshi News home page

ఆలిండియా పోలీస్ బాక్సింగ్‌లో రాష్ట్రానికి రెండు పథకాలు

Mar 8 2015 9:35 PM | Updated on Apr 7 2019 3:47 PM

63వ ఆలిండియా పోలీస్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ కాంస్య పథకాలు సాధించిన ట్లు తెలంగాణ అడిషినల్ డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు.

హైదరాబాద్: 63వ ఆలిండియా పోలీస్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ కాంస్య పథకాలు సాధించిన ట్లు తెలంగాణ అడిషినల్ డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. సైబరాబాద్ క మిషనరేట్ పరిధిలో పనిచేసే రేష్మ సుల్తానా 75 కేజీల మహిళా బాక్సింగ్‌లో విభాగంలో కాంస్య పథకం సాధించారు.

 

అంతేకాకుండా ఆమెతో పాటు 60 కేజీల విభాగంలో హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేసే సల్మాబేగం కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఆలిండియా పోలీస్ బాక్సింగ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన మహిళలు పథకాలు సాధించడం ఇదే ప్రథమమని త్రివేది తెలిపారు. విజేతలకు రూ. లక్ష నగదును అందించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement