కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్‌! 

Task Force Police Fight Against Coronavirus In Hyderabad - Sakshi

గత నెలలో అరెస్టు చేసిన నిందితుడికి ‘స్టాంప్‌’ 

తాజాగా రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌ 

ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు, సిబ్బంది 

పీపీఈ కిట్లు అందించాలంటూ వేడుకోలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడం, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం..నిర్దేశించిన కంటైన్‌మెంట్‌ జోన్ల పర్యవేక్షణ.. పాజిటివ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై నిఘా..వంటి ముఖ్య అంశాల్లో పోలీసు విభాగం పాత్ర అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఐదుగురు సిబ్బంది దీని బారినపడ్డారు. సిటీ పోలీస్‌కు గుండెకాయ వంటి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను కరోనా వెంటాడుతోంది. ప్రధానంగా తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ భయం మరీ ఎక్కువైంది. గత నెల్లో వీళ్లు అరెస్టు చేసిన ఓ నిందితుడికి ఉస్మానియా వైద్యులు క్వారంటైన్‌ స్టాంప్‌ వేయడంతో ఉలిక్కిపడ్డారు. తాజాగా వీళ్లు రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌ రావడంతో కొందరు హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది )

నిందితుడికి ‘స్టాంప్‌’ వేయడంతో... 
ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 11న ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌ హైదరాబాద్‌ నగరంతో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో 50కి పైగా దొంగతనాలు చేశాడు. మైనర్‌గా చిక్కిన మహేష్‌ను అధికారులు జువైనల్‌ హోమ్‌లో ఉంచారు. ఈ ఏడాది మార్చిలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేట్‌ల్లో నేరాలు చేశాడు. ఇతడిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెల 11న పట్టుకున్నారు. విచారణ, రికవరీ, అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికి మహేష్‌ జ్వరంతో ఉండటం, కరోనా విజృంభిస్తుండటంతో వైద్యులు అతడికి హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు. కోర్టు సైతం ష్యూరిటీపై విడిచిపెట్టాలని ఆదేశించడంతో ఇతడికి రిమాండ్‌ తప్పింది. ఇతడి క్వారంటైన్‌ సమయం 14 రోజులు ముగిసే వరకు పోలీసులకు కంటి మీద కునుకులేదు. చివరకు అంతా సజావుగానే జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్‌..
చాదర్‌ఘాట్‌ పరిధిలో చోటు చేసుకున్న ఓ బాలుడి కిడ్నాప్‌ కేసును ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండు రోజుల క్రితం ఛేదించారు. శుక్రవారం ఆ బాలుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొందరు అధికారులు, సిబ్బంది హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌ ముందు నిద్రిస్తున్న యాచకురాలి నుంచి ఈ నెల 13 ఉదయం ఆమె కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఠాణా ఈస్ట్‌జోన్‌ పరిధిలోకి రావడంతో తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు ఈ కేసును 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి చెరలో ఉన్న యాచకురాలి కుమారుడిని రెస్క్యూ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా..ఆ బాలుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు శుక్రవారం తేలింది. దీంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్‌ పోలీసులు కలిపి మొత్తం 22 మంది హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ కేసులో నిందితుడు ‘ఠాణా క్వారంటైన్‌’లో ఉన్నాడు. ఈ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు బాలుడి తల్లి నుంచీ వైద్యులు నమూనాలు సేకరించారు. ఆ నివేదిక రావాల్సి ఉండటంతో టాస్క్‌ఫోర్స్‌ సహా పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి.  

అరెస్టుల్లో అధికం ఆ ప్రాంతాల్లోనే..
ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే రాజధానిలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నగరంలోనూ ప్రధానంగా స్లమ్స్‌లోనే ఈ కేసుల విస్తరణ ఎక్కువని కనిపిస్తోంది. ఇదిలా ఉండగా... పాత నేరగాళ్లు, వాంటెడ్‌ వ్యక్తులు ఉండేది కూడా ఇదే ప్రాంతాల్లో. వీరి కదలికలపై ఏమాత్రం ఉప్పందినా తొలుత రంగంలోకి దిగేది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులే. వీటికితోడు ఈ పోలీసులు అనేక ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. అలా చేయడం వల్లే శుక్రవారం నకిలీ నెయ్యి, మద్యం లభించాయి. ఈ రకంగా సర్వకాల సర్వావస్థల్లోనూ విధులు నిర్వర్తించే తమకు ఉన్నతాధికారులు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు అందించాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కోరుతున్నారు. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర, లాక్‌డౌన్‌ సంబంధిత కేసుల మినహా ఇతర రొటీన్‌ కేసుల జోలికి పోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేస్తున్నారు. ఆ కేసుల్లో నిందితులు, అనుమానితులు, బాధితులు వారి బంధువులు..ఇలా ఎవరినీ నేరుగా తాకవద్దని, తాకాల్సి వస్తే కచ్చితంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-08-2023
Aug 11, 2023, 10:12 IST
కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది....
13-06-2023
Jun 13, 2023, 05:33 IST
న్యూఢిల్లీ:  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం తీసుకొచ్చిన కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను...
27-05-2023
May 27, 2023, 05:51 IST
వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో...
15-04-2023
Apr 15, 2023, 05:40 IST
లండన్‌: కోవిడ్‌–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా...
13-04-2023
Apr 13, 2023, 06:19 IST
న్యూఢిల్లీ: తగిన డిమాండ్‌ లేకపోవడం, కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా ఉత్పత్తిని తాజాగా...
09-04-2023
Apr 09, 2023, 04:19 IST
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 31,194కు చేరినట్లు...
08-04-2023
Apr 08, 2023, 04:44 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ...
03-04-2023
Apr 03, 2023, 06:01 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఆరు...
28-03-2023
Mar 28, 2023, 06:06 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం...
26-03-2023
Mar 26, 2023, 03:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు­త్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల...
20-03-2023
Mar 20, 2023, 05:21 IST
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35...
19-03-2023
Mar 19, 2023, 04:06 IST
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్‌ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా...
18-03-2023
Mar 18, 2023, 04:25 IST
కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే...
04-03-2023
Mar 04, 2023, 14:06 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆండ్రీ బోటికోవ్‌ ఒకరు.
22-01-2023
Jan 22, 2023, 06:21 IST
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ...
14-01-2023
Jan 14, 2023, 05:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి...
14-01-2023
Jan 14, 2023, 04:56 IST
బీజింగ్‌: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌...
11-01-2023
Jan 11, 2023, 18:10 IST
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ...
08-01-2023
Jan 08, 2023, 09:48 IST
గుంటూరు మెడికల్‌ : అమెరికా నుంచి గుంటూరు వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుమారు పదిరోజుల కిందట ముత్యాలరెడ్డినగర్‌కు...
08-01-2023
Jan 08, 2023, 05:58 IST
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్‌ యున్‌’లూనార్‌ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి...



 

Read also in:
Back to Top