27న రాష్ట్రబంద్‌ | State bundh on 27th | Sakshi
Sakshi News home page

27న రాష్ట్రబంద్‌

Dec 24 2017 3:07 AM | Updated on Oct 8 2018 3:00 PM

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంద కృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంద కృష్ణ విడుదలను కోరుతూ ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 27న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్‌ ప్రకటించింది. మంద కృష్ణకు ఎటువంటి హాని జరిగినా అందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement