సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్లో నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలి. కానీ కరోనా దృష్ట్యా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలు పూర్తికాకపోవడంతో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్ నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలు వెలువడేవి. అనంతరం గురు కుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గం సుగమమయ్యేది. ఇప్పటివరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సైతం సందిగ్ధంలో పడింది. దీంతో గురుకు లాల్లో అన్ని కేటగిరీల్లో ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది.
లాక్డౌన్ తర్వాతే...
రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయకుండా సడలింపుల ద్వారా ఒక్కో రంగానికి అనుమతులిస్తారు. ఎక్కువ మంది సమూహంగా ఏర్పడే కార్యక్రమాలకు అనుమతి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రవేశ పరీక్షలను మేలో నిర్వహించే అవకాశం లేదనిపిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో అన్ని రకాల సెట్లకు సంబంధించి దర ఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల (టీజీసెట్)పై స్పష్టత రానున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖా స్తులు స్వీకరించారు.
ప్రవేశ పరీక్షను జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. లాక్డౌన్ తర్వాత మరోసారి దరఖాస్తుకు గడువు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సొసైటీలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుకు కూడా మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును మే 10వ తేదీ వరకు పొడిగించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్డౌన్ సడలింపులపై స్పష్టత వచ్చాక అన్ని సొసైటీలు వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జూన్లో గురుకుల అడ్మిషన్లు?
Published Wed, Apr 29 2020 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement