హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి.
దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు
Mar 6 2015 7:16 AM | Updated on Apr 7 2019 3:28 PM
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. అయితే, అందులోని మొత్తం 29 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు ఇంజన్ లోంచి పొగలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు దాదాపు 3 గంటల పాటు రోడ్డుమీదే నిలబడిపోవాల్సి వచ్చింది.
Advertisement
Advertisement