ఆరుగురు నకిలీ జర్నలిస్టుల అరెస్ట్ | Six fake journalists arrested | Sakshi
Sakshi News home page

ఆరుగురు నకిలీ జర్నలిస్టుల అరెస్ట్

Sep 29 2015 7:06 PM | Updated on Aug 29 2018 4:16 PM

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పత్రిక, టీవీ ఛానల్ పేరు చేప్పి డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో క్లీనిక్ నిర్వహిస్తున్న బోజ్జ రమేష్ అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కొందరు వ్యక్తులు "నీ దగ్గర అనుమతి లేకున్నా ల్యాబ్ నిర్వహిస్తున్నావంటూ ఈ విషయాన్ని పత్రికల్లో, టీవీల్లో వచ్చేలా చేసి..  నీ జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతామని" బెదిరించి..లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో భయపడి పోయిన డాక్టర్ అంత డబ్బు ఇవ్వలేనని... 20 వేలు మాత్రం ఇవ్వగలని చెప్పాడు.

డబ్బు కోసం మిర్యాలగూడకు రావాల్సిందిగా ముఠా సభ్యులకు చెప్పాడు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement