ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మృతి చెందాడు.
జన్నారం: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. సుబ్బయ్య (55) శనివారం రాత్రి అందరితోపాటు నిద్రించగా, ఆదివారం ఉదయం చూసేసరికి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అనారోగ్య సమస్యలు లేవని, చలి తట్టుకోలేక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలుగా ఉంది.